కుత్బుల్లాపూర్,జూన్30 : గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న ఓ ముఠా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు పట్టుడింది. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం పేట్ బషీరాబాద్లో పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఎస్ఓటీ సైబరాబాద్ డీసీపీ డి.శ్రీనివాస్ మీడియాకు వెళ్లడించారు. ఒడిషా నుంచి దిగుమతి చేసుకున్న ఎండు గంజాయిని(Ganja seizure) రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 28న శామీర్పేట్లోని(Shameerpet) ఓఆర్ఓర్ టోల్గేట్(ORR tollgate) వద్ద ఎస్ఓటీ, శామీర్పేట్ పోలీసులు తనిఖీలు చేపట్టారన్నారు.
బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 33 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. నిందితులు ఏపీలోని ఏలూరుకు చెందిన గేదెల సతీష్ (34), గన్నవరంకు చెందిన కోరాడ సాయికుమార్(26), బండారు శివ కుమా ర్ (27) పట్టుబడ్డారన్నారు. వీరితో పాటు ఓడిశా ప్రాంతానికి చెందిన శివ అనే నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామన్నారు. నిందితుల వద్ద లభించిన గంజాయితో పాటు రూ.50 వేల నగదు, నాలుగు ఫోన్లు సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలించిన్నట్లు వారు. తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు.