సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): నగరవ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్ మంగళవారం ఎంటమాలజీ చీఫ్ రాంబాబు, ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఆరు రోజులకొకసారి తప్పనిసరిగా ఫాగింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో లాగ్బుక్స్, రికార్డులు సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలని చెప్పారు. డెంగీ కేసులు నమోదవుతున్న ప్రాంతాలు, హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ఫాగింగ్పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. 4846 కాలనీలలో దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.