సిటీబ్యూరో, హిమాయత్నగర్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అదనపు కమిషనర్ రవికిరణ్తో కలిసి నారాయణగూడ క్రాస్రోడ్, శంకర్మఠ్ వద్ద రాంకీ ఆర్ఎఫ్సీ వెహికల్ డ్రైవర్తో కమిషనర్ మాట్లాడి చెత్త తరలింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నారాయణగూడ ఫ్లై ఓవర్ సమీపంలో కొత్తగా నిర్మించిన మోడల్ మార్కెట్ పనుల విషయాన్ని అక్కడే ఉన్న చిరు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు.