నగరంలో ప్రధాన రహదారుల్లోనే చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. అన్ని సర్కిళ్లలో స్వచ్ఛ ఆటోలు ఉన్నా వాటిని నిర్వహించడంలో నగరవాసులకు అవగాహన కలిపించడంలో బల్దియా సిబ్బంది విఫలమవుతున్నారు. ముషీరాబాద్లోని బాపూజీ నగర్లో రహదారిపై చెత్త పేరుకుపోయిన దృశ్యం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శంఖారావం పూరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా సమస్యలపై శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాగంటి మాట్లాడుతూ.. ఇందులో భాగంగా తాగునీటి సమస్య పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాల వల్ల వివిధ శాఖలకు చెందిన అధికారులు వారి పరిధిలోని సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించిన వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.