మారేడ్పల్లి, జూలై 1: రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ. 4,50,000 విలువ చేసే 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ జావేద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ కథనం ప్రకారం.. ముంబైకి చెందిన అబూబాకర్ కసమ్ షేక్ (47) ప్లంబర్. తనకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో గంజాయి దందాను ఎంచుకున్నాడు. విశాఖపట్నంలో గుర్తు తెలియని ఓ వ్యక్తిని నుంచి రూ. 90 వేలకు 18 కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. గతనెల 29న విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు రైలులో గంజాయి తరలిస్తున్నాడు. నిందితుడు ప్రయాణిస్తున్న రైలు 30న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఆ సమయంలో ప్లాట్ ఫారం నంబర్-1లో రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు కలిసి తనిఖీలు చేస్తున్నాడు. నిందితుడు అబూబాకర్ అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే రైల్వే పోలీసులు అతడి వద్దకు వెళ్లి ట్రాలీ సూట్ కేస్ను తనిఖీ చేయగా.. అందులో గంజాయి ఉన్న విషయం బయటపడింది. రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.