Hyderabad | హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాకర్టకు గంజాయి విక్రయిస్తున్న ఓ పాత నేరస్తుడిని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న నేరస్తుడిని పెడ్లర్ సురేశ్ సింగ్గా గుర్తించారు. అతనిపై గతంలో ఐదు కేసులు నమోదు అయినట్లు సమాచారం.
ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్లు కె.మణికందన్, వి.అరవింద్లు శుక్రవారం ఉదయం గంజాయి కొనుగోలు చేస్తుండగా సుల్తాన్ బజార్ పోలీసులకు చిక్కారు. పట్టుబడిన జూనియర్ డాక్టర్లకు టెస్ట్లో పాజిటివ్ రావడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు జూనియర్ డాక్టర్లతో పాటు గంజాయి పెడ్లర్ సురేశ్ సింగ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. మెడికల్ కాలేజీలో ఇంకా ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో నలుగురు జూనియర్ డాక్టర్లు కూడా గంజాయి తీసుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.