Drinking Water | సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్స్టేషన్లలో టీజీ ట్రాన్స్కో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు 5వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల వరకు ఈ పనులు జరుగుతాయని, 24 గంటల పాటు పలు రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
షేక్పేట, భోజగుట్ట రిజర్వాయర్ (లోప్రెజర్), జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, మూసాపేట, కేపీహెచ్బీ, హైదర్నగర్, నల్లగండ్ల, చందానగర్, హుడా కాలనీ, హఫీజ్పేట, మణికొండ, నార్సింగి తదితర ప్రాంతాల్లో నీటి అంతరాయం ఉంటుందన్నారు.