సిటీబ్యూరో, జూన్ 28(నమస్తే తెలంగాణ): ఆషాఢ మాసం బోనాల పండుగ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అ న్ని ఏర్పాట్లు చేస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ ముషారప్ ఫరూఖీ తెలిపారు. ఖైరతాబాద్లోని కార్పొరేట్ కార్యాలయంలో ఇన్చార్జి డైరెక్టర్లు నంద కుమార్, డాక్టర్ నర్సింహులు, చీఫ్ ఇంజనీర్లు కె.సాయిబాబా, ఎల్.పాండ్య, వి.శివాజీ, పి.బిక్షపతి, పి.ఆనంద్, సీజీఎం కృష్ణారెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం, ఉన్నతాధికారులకు సీఎండీ ప్రత్యేకంగా పలు సూచనలు చేశారు.