సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా జానకి రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్ఫోర్స్ విభాగం డీఎస్పీగా అమీర్పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించనున్నారు.
ఇంతకు ముందు ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా పని చేసిన సత్తయ్యను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న జానకి రెడ్డి విధుల్లో చేరారని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.