హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ను(Drugs) నిరోధించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలువాటుపడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు. మంగళవారం నెక్లెస్రోడ్డులోని జలవిహార్(Jalavihar) వద్ద డ్రగ్స్ నిర్మూలన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం అత్యంత ప్రమాదకరమన్నారు.
విద్యార్థులు, యువత వీటి బారిని పడి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వినియోగంతో కుటుంబ వ్యస్థలు విచ్ఛిన్నం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు అక్రమార్జన కోసం వీటిని ప్రోత్సహిస్తున్నారు. దేశాన్ని బలహీనపరిచే ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రగ్స్ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
మదకద్రవ్యాల నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరోకు ఎన్ని నిధులైన కేటాయిస్తామన్నారు. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా ప్రజల నుంచి కూడా సహకార కావాలన్నారు. అన్ని గ్రామాల్లో డ్రగ్స్ నిర్మూలన కమిటీలు వేయాలన్నారు. తాత్కాలిక సంతోషాలకు విద్యార్థులు బలికావొద్దని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.