హైదరాబాద్ : మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhender Reddy) పరామర్శించారు. ఇటీవల శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్(Shankar Yadav) మరణించగా, శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావుతో కలిసి వెస్ట్ మారేడ్పల్లిలోని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు(Tribute) అర్పించారు. అనంతరం శ్రీనివాస్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు.