Bonalu Festival | హైదరాబాద్ : భాగ్యనగరం బోనమెత్తనుంది. జులై 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆషాఢ బోనాలకు రూ. 20 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆషాఢ బోనాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో ఈ సమీక్ష జరిగింది. సమీక్షలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది జులై 7 నుంచి 29తేదీ వరకు అత్యంత వైభవంగా బోనాల పండుగను నిర్వహించనున్నారు.
ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం(జూలై 7) రోజు భాగ్యనగరంలో బోనాల సంబరం ప్రారంభమవుతుంది. గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలిపూజ నిర్వహించిన తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో నెలరోజుల పాటూ ప్రతి గురువారం, ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. మళ్లీ గోల్కొండ కోటలోనే చివరి రోజు పూజ నిర్వహించడంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.
బోనాల జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, మెట్రో, ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. ఉచిత బస్సు సౌకర్యం ఉండటం వల్ల ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు తగ్గట్లుగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాల్లో కళాబృందాలను తీసుకురావడంతో పాటు, లేజర్ షోలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
Gandhi Bhavan | గాంధీ భవన్ను ముట్టడించిన గురుకుల అభ్యర్థులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Renu Desai | కామెంట్ చేసే ముందు మీ ఇంట్లో తల్లి, కూతురు ఉంటారని గుర్తుంచుకోండి : రేణు దేశాయ్