హైదరాబాద్: అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని (Hyderabad) జూబ్లీహిల్స్లో చోటుచేసుకున్నది. జూబ్లీహిల్స్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ జరుగుతున్నది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. అయితే స్థానిక కార్పొరేటర్, కాంగ్రెస్ నేత బాబాఫసియుద్దీన్ అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. దీంతో ఆయన స్థానంలో అతని సతీమణి కార్యక్రమానికి వచ్చారు.
దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి కార్పొరేటర్ సతీమణి అధికారిక కార్యక్రమంలో ఎలా పాల్గొంటారని నిలదీశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. తోపులాటకు దారితీయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి బయటకు పంపించారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
జూబ్లీహిల్స్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొనగా.. స్థానిక కార్పొరేటర్, కాంగ్రెస్ నేత బాబాఫసియుద్దీన్ అనారోగ్యం కారణంగా రాకపోవడంతో అతని భార్య వచ్చింది.
దీంతో ప్రోటోకాల్ ఉల్లంఘించి… pic.twitter.com/JTsxpiFRRI
— Telugu Scribe (@TeluguScribe) June 29, 2024