Musi River | సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : మూసీ నది నుంచి 50 మీటర్ల పరిధిలో నిర్మాణ రంగ అనుమతులను నిలిపివేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నిర్ణయం తీసుకున్నారు. మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల లోపు భవన, లే అవుట్ నిర్మాణాలకు ఆంక్షలు ఉన్నాయి. అయితే అక్కడక్కడ భవనాలు, షెడ్లు వెలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కమిషనర్ టౌన్ప్లానింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రభుత్వం మూసీని అద్భుత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే ఎంఆర్సీడీఎల్ విజ్ఞప్తి మేరకు మూసీ తీరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.