ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 2: సమస్యలు పరిష్కరించాలంటూ నగర వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఉద్యోగాల విషయంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాక ముందు నిరుద్యోగులకు హామీల మీద హామీలు గుప్పించి, అధికారం వచ్చాక నిరుద్యోగులను, వారి సమస్యలను పక్కనబెట్టారు. అంటే.. ‘ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా..’ కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరున్నదని చెప్పకనే చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో మంగళవారం నగర వ్యాప్తంగా పలుచోట్ల పలు విద్యార్థి సంఘాలు ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టాయి. సీఎం స్పందించకుంటే.. ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేపడ్తామని నిరుద్యోగ యువత నిరసన గళం పెద్ద పెట్టున వినిపిస్తున్నారు.
నిరు ద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల సంఖ్యను పెం చాలని, మెగా డీఎస్సీని ప్రకటించాలని డి మాండ్ చేశారు. పీడీఎస్యూ ఓయూ కమిటీ మంగళవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జాతీయ నాయకుడు ఎస్.నాగేశ్వరరావు, ఓయూ అధ్యక్షుడు సు మంత్ మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీల ద్వారా ఏర్పడిన ఖాళీలను కలిపి, మెగా డీఎస్సీ నిర్వహించినపుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. వివిధ రకాల గ్రూప్ ఉద్యోగాల లో పోస్టులు తగిన మొత్తంలో లేవని, తక్షణ మే పోస్టుల సంఖ్యను పెంచి, భర్తీ చేయాలన్నారు. పీడీఎస్యూ నాయకులు రుక్మత్ పా షా, అంజి, ప్రశాంత్, సతీశ్, క్రాంతి, కోటేశ్వర్, శ్రీవాణి, సౌజన్య, భవాని, రామ్ పాల్గొన్నారు.
సీఎంను ఇంటికి పంపించేందుకు సిద్ధం..
శంషాబాద్ రూరల్, జూలై 2: నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీజేవైఎం శంషాబాద్ మండలాధ్యక్షు డు బుక్కా ప్రవీణ్ ఆరోపించారు. నిరుద్యోగులను ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం వారిని ఆదుకోక పోగా.. అరెస్టులతో పాటు దాడులు చేస్తుండటంతో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడు నెలలు దాటినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డిని త్వరలో ఇంటికి పంపించడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం, తహసీల్దార్ నాగమణికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిరుద్యోగుల హామీలకు పరిష్కారం ఎక్కడా?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చి న హామీలను తక్షణమే నేరవేర్చాలని భారతీయ జనతా యువ మోర్చా హైదరాబాద్, గోల్కొండ జిల్లా అధ్యక్షుడు నితిన్ నందాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నిరుద్యోగ భృతిని ఇవ్వాలని నాంపల్లిలోని మండల రెవెన్యూ కార్యాలయం వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళాలని నాంపల్లి ఎంఆర్వోకు ఆయన వినతి పత్రం అందజేశారు. అనంతరం, ఆయన మాట్లా డుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తామన్న హామీలు ఏమయ్యాయని ఆ యన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పడి ఏడు నెలలు గడుస్తున్నా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవడం, ‘దున్నపోతు మీద వర్షం పడ్డ చం దంగా..’ ఉన్నదని ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. గ్రూప్-1 ప్రిలిమ్స్లో 1:100 శాతం ప్ర కారం, క్వాలిఫై చేయాలని, గ్రూప్-2, గ్రూ ప్-3 నోటిఫికేషన్లలోఅదనంగా పోస్టులను పెంచాలని, 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలని, ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను పోస్ట్ఫోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలని, అన్ని నియామకాలలో మహిళా అభ్యర్థులకు 33 శాతం రిజర్వేషన్ కేటాయించాలని, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నం.46ను రద్దు చేయాలని, జాబ్ క్యా లెండర్ను తక్షణమే ప్రభుత్వం విడుదల చే యాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంజే మార్కెట్ వద్ద దిష్టిబొమ్మ దహనం
మోజం జాహి మార్కెట్ చౌరస్తాలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ మేరకు మంగళవారం రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం అధ్యక్షుడు నితిన్ నందాకర్ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.