సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణ, సుందరీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పనిచేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువుల సుందరీకరణకు భారీ మొత్తంలో నిధులను కేటాయించి పనులు చేపడుతున్నది. తాజాగా మల్కాజిగిరి నియోజకవర్గం ఆర్.కె.పురం పరిధిలోని ముక్కిడి చెరువు, కూకట్పల్లిలోని రంగధాముని చెరువుల వద్ద రూ.16.95 కోట్లతో పనులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రత్యేకంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ పనులను వెంటనే చేపట్టేందుకు వేర్వేరుగా మూడు టెండర్లను పిలిచారు. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, చెరువుల సుందరీకరణను చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న లేక్ ప్రొటెక్షన్ కమిటీ చెరువులకు సంబంధించి పూర్తి స్థాయి విస్తీర్ణం, ఎఫ్టీఎల్లను గుర్తించి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసి చెరువులు కబ్జా కాకుండా చర్యలు చేపట్టారు.
మల్కాజిగిరిలోని ఆర్.కె.పురం పరిధిలోని ముక్కిడి చెరువు ప్రధాన చెరువు కట్ట ఆధునీకరణ, ఇతర పనులకు రూ.4,91,36,405.00
కూకట్పల్లిలోని రంగధాముని చెరువు (ఐడీఎల్ లేక్) వద్ద సీవరేజీ డైవర్షన్, ఐ అండ్ డీ నిర్మాణానికి రూ.5,42,09,777.00
కూకట్పల్లిలోని రంగధాముని చెరువు కట్ట నిర్మాణం, ఫాత్వేలు, హ్యాండ్ రెయిలింగ్ పనులు రూ. 6,62,13,330.0