మారేడ్పల్లి, జూన్ 27: ఇంట్లో తిరుపతి దేవస్థానానికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వచ్చిన ఓ వృద్ధుడిని రైలు ఢీ కొట్టడంతో(Train accident) అక్కడిక్కడే మృతి(Old man died a) చెందిన సంఘటన సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం..నిజామాబాద్ ప్రాంతానికి చెందిన చెందిన ఎక్కెరల పెద్దరాజు (69) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కాగా, దైవ దర్శనానికి తిరుపతికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఈ క్రమంలో మౌలాలి-చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్యన పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచా రం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.