ఉస్మానియా యూనివర్సిటీ /హిమాయత్నగర్, డిసెంబర్ 15: మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. హిమాయత్నగర్ వై జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయగా, ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఓయూ ప్రొఫెసర్ అన్సారీ మాట్లాడుతూ ఉపకార వేతనాల రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి విక్కీ, రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు రహమాన్, ఓయూ అధ్యక్షుడు క్రాంతిరాజ్, నాయకులు యాకూబ్, మోయిన్, రెహమాన్, గ్యార క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.