సైదాబాద్: పాతబస్తీ విద్యుత్ నిర్వహణను అదానీ కంపెనీకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో సంతోష్నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర నాయకులు ఈశ్వర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని తొమ్మిది విద్యుత్ సర్కిళ్లను మొదటి దశగా అదానీ కంపెనీకి అప్పగించాలని రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన ప్రకటన ద్వారా ప్రజలకు ప్రైవేటు కంపెనీలకు విద్యుత్ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తున్నదన్నారు.