హైదరాబాద్ : ఈ నెల 19, 20వ తేదీలతో పాటు వచ్చే నెల 10, 11వ తేదీలలో ఫార్ములా ఈ- రేస్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీ సంతోష్ తెలిపారు. ఫార్ములా ఈ రేస్ ఏర్పాట్లలో భాగంగా గురువారం అర్భన్ఫారెస్ట్రీ డైరెక్టర్ ప్రభాకర్తో కలిసి సంతోష్ మీడియాతో మాట్లాడారు. ఈవెంట్కు నాలుగు రోజుల ముందు నుంచి రోడ్ను మూసివేస్తామని పేర్కొన్నారు. మిగిలిన రోజుల్లో రోడ్ ఓపెన్గా ఉంటుందని వివరించారు. 11 టీంలు, 22 కార్స్లు ఈవెంట్లో పాల్గొంటాయని, మహీంద్రా, జాగ్వర్ లాంటి కంపెనీలు ఇందులో ఉన్నాయని తెలిపారు.
ఈ రేస్ 320 కిలోమీటర్ల మేర మాక్సిమం స్పీడ్ ఉంటుందన్నారు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ నగరం వైపు చూస్తుందని, హైదరాబాద్ సంస్కృతిని చాటి చెప్పే విధంగా నగరం నడిబొడ్డున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. 2.7 కిలోమీటర్ల మేర ట్రాక్ ఏర్పాటులో 214 చెట్లలో 125 సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లో 81 చోట్ల ఫ్లాంటేషన్ చేపట్టినట్లు తెలిపారు. తిరిగి నాటిన 214 చెట్లను చనిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.