Health Tips : కొన్ని రకాల ఆహార పదార్ధాలతో నిర్ధష్ట రకాల క్యాన్సర్ బారినపడే ముప్పు అధికమని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మనం ఆరోగ్యకర ఆహారాలను తీసుకుంటూ క్యాన్సర్ ముప్పును పెంచే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండటం ద్వారా ప్రాణాంతక వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో అధికంగా కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, నట్స్ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
ప్రాసెస్డ్ ఆహారం, మద్యం, గ్రిల్డ్ ఫుడ్ వంటి ఆహారాలకు దూరంగా ఉండటం మేలు. ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ మీట్ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు అధిక ఉప్పు వాడతారని వీటిని అధికంగా తీసుకునేవారిలో కొలొరెక్టల్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పొంచిఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇక అధికంగా వేయించిన పదార్ధాలకు దూరంగా ఉండాలి.
వీటి ద్వారా క్యాన్సర్తో పాటు టైప్ 2 మధుమేహం, గుండె జబ్బుల ముప్పు కూడా అధికమేనని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. షుగర్ అధికంగా ఉండే సోడాలు, వైట్ బ్రెడ్, వైట్ పాస్తా వంటి అధిక రిఫైన్డ్ ఆహారాలతో క్యాన్సర్ ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద గ్రిల్ చేసే మాంసం, ఇతర ఆహర పదార్ధాలు క్యాన్సర్ ముప్పును పెంచుతాయని చెబుతున్నారు. ఇక క్యాన్సర్ ముప్పు పెంచే ఆహార పదార్ధాలను పరిశీలిస్తే..
ప్రాసెస్డ్ మీట్స్
ఫ్రైడ్ ఫుడ్
షుగర్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్
ఆల్కహాల్
ట్రాన్స్ఫ్యాట్స్
గ్రిల్డ్ ఫుడ్
Read More :
ORR | పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. పార్థి గ్యాంగ్ అరెస్ట్