తిరుపతి : తిరుమల(Tirumala) లోని వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నడిచే వివిధ కార్యక్రమాలకు ఓ భక్తుడు స్వామివారికి రూ. 20 లక్షలను విరాళంగా అందజేశాడు. జార్ఖండ్కు చెందిన సరళా ఇంజినీరింగ్ లిమిటెడ్ యజమాని ఎస్వీబీసీ ట్రస్ట్ (SVBC Trust) కు రూ.10 లక్షలు , ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్(Annadanam turst) కు రూ.10 లక్షలు అందించారు. సంస్థ ప్రతినిధి తిరుపతికి చెందిన రాఘవేంద్ర సోమవారం తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావుకు డీడీలను అందజేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 77,878 మంది భక్తులు దర్శించుకోగా 30,140 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.46 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.