అమరావతి : వడ్డికాసులవాడు కొలువుదీరిన తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తుల రద్దీతో కిటికటలాడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు (Compartments) పూర్తిగా నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌజ్(Krishnateja Guest House) వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 60,782 మంది భక్తులు దర్శించుకోగా 30వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.53 ఆదాయం వచ్చిందని తెలిపారు.