తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 31 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి. ఏటీసీ గెస్ట్హౌజ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు.
నిన్న స్వామివారిని 63,826 మంది భక్తులు దర్శించుకోగా 27,530 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు వచ్చిందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని వారు పేర్కొన్నారు.