దేశాన్ని కదిలించిన యధార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణకుమార్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘మట్కా’. వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరుణ్తేజ్ ఇందులో మరపురాని పాత్రను పోషిస్తున్నారని కరుణకుమార్ చెబుతున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఆర్ఎఫ్సీలో జరుగుతున్నది. 35రోజుల పాటు సుధీర్ఘంగా జరిగే ఈ భారీ షెడ్యూల్కోసం 15కోట్ల బడ్జెట్ని నిర్మాతలు కేటాయించారని, పాతకాలంనాటి వైజాగ్ని తలపించేలా ఆర్ఎఫ్సీలో నిర్మించిన మ్యాసీవ్ సెట్లో ఈ షెడ్యూల్ జరుగుతుందని దర్శకుడు తెలిపారు. గ్రాండియర్గా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అందించేలా ఇందులోని సన్నివేశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
భారీ బడ్టెట్తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రధారి. ఇంకా నవీన్చంద్ర, అజయ్ఘోష్, కన్నడ కిశోర్, తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఏ.కిశోర్కుమార్, సంగీతం: జి.వి.ప్రకాశ్కుమార్.