కిరణ్కుమార్, అలేఖ్య రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘దీక్ష’. ప్రతాని రామకృష్ణగౌడ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పినిశెట్టి అశోక్ కుమార్, మదాడి కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ ‘సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించగలమనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
ఈ సినిమా ద్వారా నలుగురు కథానాయికలను పరిచయం చేస్తున్నాం. త్వరలోవిడుదల తేదీని ప్రకటిస్తాం. అలాగే ‘మహిళా కబడ్డీ’ అనే చిత్రాన్ని 18 భాషల్లో తెరకెక్కించబోతున్నాం’ అన్నారు. యువతరానికి సందేశాన్నందించే చిత్రమిదని హీరో కిరణ్ చెప్పారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే చక్కటి సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని రైటర్ రాంప్రసాద్ తెలిపారు.