Samantha | తమిళ సినీరంగంలో దళపతి విజయ్-సమంత జోడీని హిట్ పెయిర్గా అభివర్ణిస్తారు. వీరిద్దరూ కలిసి నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. దీంతో ఈ జంట వెండితెరపై మరోమారు సందడి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో విజయ్ 69వ చిత్రంలో సమంత కథానాయికగా ఖరారైందని తమిళ ఫిల్మ్ సర్క్సిల్స్లో ప్రచారం జరుగుతున్నది. దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన చివరి చిత్రంగా ‘విజయ్ 69’కు సన్నాహాలు చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తారు.
డీవీవీ దానయ్య నిర్మాత. ఇందులో విజయ్ యువ రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని అంటున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సమంత దాదాపుగా ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. ప్రస్తుతం సమంత స్వీయ నిర్మాణ సంస్థలో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది.