ఇటీవలే ‘అరణ్మనై-2’ (తెలుగులో ‘బాక్’) చిత్రంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అగ్ర కథానాయిక తమన్నా. కథాంశాల ఎంపికలో కొత్తదనానికి పెద్దపీట వేస్తూ కెరీర్లో దూసుకుపోతుందీ భామ. తాజా తెలుగు చిత్రం ‘ఓదెల-2’లో ఈ అమ్మడు యాక్షన్ విన్యాసాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నది. అశోక్తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్నంది టీమ్ వర్క్స్ నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ను తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాల కోసం తమ న్నా ప్రత్యేక శిక్షణ తీసుకుందని, ఆమెలోని ఇంటెన్స్ యాక్షన్ కోణాన్ని ఆవిష్కరించే చిత్రమవుతుందని దర్శకుడు తెలిపారు.
‘ఓదెల’ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంతం ఉత్కంభరితంగా సాగుతుందని నిర్మాతలు తెలిపారు. హెబ్బాపటేల్, వశిష్ట ఎన్ సింహ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్రాజన్ ఎస్, సంగీతం: అజనీష్ లోక్నాథ్, నిర్మాత: డి.మధు, దర్శకత్వం: అశోక్తేజ.