బ్లాక్బాస్టర్ ‘టిల్లు స్కేర్’ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించనున్న చిత్రం ‘తెలుసు కదా’. నీరజ కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 5 నుంచి మొదలుకానుంది. ఈ భారీ షెడ్యూల్లో టాకీ పార్ట్తో పాటు సాంగ్స్ని కూడా షూట్ చేస్తారు.
హైదరాబాద్లో నెలరోజులపాటు సాగే ఈ షెడ్యూల్లో సినిమాలోని ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటారని మేకర్స్ తెలిపారు. సిద్ధు స్టార్డమ్ని దృష్టిలో పెట్టుకొని పర్ఫెక్ట్ స్క్రిప్ట్ని నీరజ రెడీ చేశారని, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్తో సినిమా నిర్మించనున్నామని, అందుకే ప్రీప్రొడక్షన్ విషయంలోనే జాగ్రత్తలు తీసుకున్నామని, రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధు మరింత ైస్టెలిష్గా కనిపించనున్నారని మేకర్స్ తెలిపారు.