Ramya Pasupuleti | ‘దర్శకుడు లక్ష్మణ్ కార్య నన్ను ఇన్స్ట్రాలో చూసి పిలిపించారు. ఆఫీస్కి వెళ్లాక ఆడిషన్స్ చేశారు. నా నటన నచ్చడంతో హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇందులో నా పాత్ర ఆడియన్స్కి కావాల్సినంత నవ్వులు పంచుతుంది. నిజానికి నవ్వించడం కష్టం. నవ్వించగలిగామంటే నటిగా సక్సెస్ అయినట్టే. అందుకే కాస్త కష్టమైనా ఇష్టంగా ఈ పాత్ర చేశా. ’ అని రమ్య పసుపులేటి అన్నారు. రావురమేశ్ హీరోగా రూపొందిన చిత్రం ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’.
ఇందులో రావురమేశ్ కొడుకుగా నటించిన అంకిత్ కొయ్యకు జోడీగా రమ్య నటించింది. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం రమ్య విలేకరులతో ముచ్చటించింది. ‘ఇందులో నేను పద్దెనిమిదేండ్ల అమ్మాయిగా నటించా. క్యూట్ లవ్స్టోరీ కూడా ఉంటుంది. కథ రీత్యా గ్లామరస్, ట్రెడిషనల్గా రెండు రకాలుగా కనిపిస్తా.’ అని చెప్పుకొచ్చింది రమ్య.
సిద్ శ్రీరామ్ పాడిన ‘మేడమ్ సార్ మేడమ్..’ పాటకు మంచి స్పందన వస్తున్నదని, అంకిత్ కొయ్య మంచి నటుడు, వెరీ అమేజింగ్ కోయాక్టర్ అని, రావురమేశ్, ఇంద్రజ లాంటి సీనియర్స్తో కలిసి నటించడం గొప్ప అనుభవమని రమ్య పేర్కొన్నారు.