Vijay Devarakonda – Rukmini Vasanth | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. లైగర్ వంటి భారీ డిజాస్టార్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు ఫ్లాప్గా నిలిచాయి. ఇక ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శ్రీలంకలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్లో ఉండగానే మరో ప్రాజెక్ట్ను విజయ్ పట్టాలెక్కించబోతున్నాడు.
‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవికిరణ్ కోలాతో విజయ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ రోల్కు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కథానాయికగా సప్త సాగరాలు బ్యూటీ రుక్మిణి వసంత్ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని అనుకున్నారు మేకర్స్. కానీ అనుకోకుండా ఆ ప్లేస్ లో ఇప్పుడు రుక్మిణి వచ్చింది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Also Read..
AP TET | బిగ్ అలర్ట్.. టెట్ దరఖాస్తుల గడువు పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Animal Movie | ‘యానిమల్’ వివాదంపై తొలిసారి స్పందించిన రణ్బీర్ కపూర్
Bhadrachalam | భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం