Rashimika Mandanna | టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాటు ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘చావా’ వంటి సినిమాలతో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ భామ మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో నటించేందుకు రెడీ అయినట్లు సమాచారం.
బాలీవుడ్ స్టార్ నిర్మాత దినేష్ విజన్ ‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’ లాంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అయితే తాజాగా దినేష్ తాజాగా ఆయుష్మాన్ ఖురానాతో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఇప్పటికే ఆయుష్మాన్ ఖురానాతో చర్చలు జరుపగా ఆయుష్మాన్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. హార్రర్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాకు ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాకు ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్నగర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ సినిమా కోసమే కథానాయికగా రష్మిక మందన్నా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.