Allu Arjun | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. ఈ భారీ బడ్జెట్ మూవీని వైజయంతి నిర్మించింది. శుక్రవారం విడుదలైన మూవీ బ్లాక్బస్టర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నది. విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. మూవీ కళ్లు చెదిరే విజువల్స్తో కనులపండువలా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ‘సూపర్ హీరో తరహాలో తన ప్రతిభతో ఈ భారీ చిత్రానికి ప్రాణం పోసిన మిత్రుడు ప్రభాస్కు వందనాలు. అమితాబ్ బచ్చన్ గారు.. మీరు నిజంగా స్ఫూర్తిప్రదాత. ఈ సినిమాలో మీ నటన చూశాక ఇక మాటల్లేవ్. కమల్ సర్.. మీ పెర్ఫార్మెన్స్కు ప్రశంసలు.
Kudos to #Kalki2898AD team. Outstanding visual spectacle .
Respect for my dear friend #Prabhas garu for empowering this epic . Entertaining super heroic presence. @SrBachchan Ji, you are truly inspirational… no words 🙏🏽 . Adulation to our @ikamalhaasan sir looking fwd for…
— Allu Arjun (@alluarjun) June 29, 2024
మీరు భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు మరిన్ని చేస్తారని ఆశిస్తున్నా. డియర్ దీపికా అదరగొట్టావ్. సునాయాసంగా నటించావు. దిశా పటానీ నువ్వు తెరపై ఎంతో ఆకర్షణీయంగా కనిపించావు డియర్. నటీనటులకు, టెక్నీషియన్లకు, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ఎడిటింగ్, మేకప్ విభాగానికి నిపుణులకు అభినందనలు. ఈ ఘనత వైజయంతీ మూవీస్కు, అశ్వనీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్కు దక్కుతుంది. ఇండియన్ మూవీ ప్రమాణాలను పెంచే బృహత్తర చిత్రాన్ని అందించారు. నాగ్ అశ్విన్ ప్రతి సినిమా ప్రేమికులు ఆశ్చర్యపోయేలా మూవీని తెరకెక్కించారు. మూస ధోరణులను ధ్వంసం చేసి ఈ తరం కోసం సరికొత్త బాటలు వేసిన ఫిలింమేకర్ నాగ్ అశ్విన్. నా అభినందనలు. చివరగా అంతర్జాతీయ స్థాయి చిత్రాలకు ధీటుగా మన సాంస్కృతిక సున్నితత్వాలతో వెండితెరపైకి వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.