సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకుడు. పీఎల్వి క్రియేషన్స్ పతాకంపై పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. శనివారం ఈ సినిమా గ్లింప్స్ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..గ్లింప్స్ చూస్తుంటే కొత్త కంటెంట్తో తెరకెక్కించారని అర్థమవుతున్నదని, సాయికుమార్ సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయని అన్నారు.
టైటిల్కు తగినట్టే సహజమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతున్నామని, గోదావరి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథ ఇదని నిర్మాత పారమళ్ల లింగయ్య తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఈదర ప్రసాద్, సంగీతం: మార్కండేయ, రచన-దర్శకత్వం: పీఎల్ విఘ్నేష్.