Prabhas | ప్రస్తుతం దేశం మొత్తాన్ని ‘కల్కి’ మేనియా ఆవహించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతున్నది. లాంగ్న్ల్రో వెయ్యికోట్ల వసూళ్లు సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘కల్కి’ అపూర్వ విజయంతో ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉన్న ప్రభాస్ తన తదుపరి చిత్రం ‘శౌర్యంగపర్వం’ కోసం సన్నద్ధమవుతున్నారని తెలిసింది.
‘సలార్-ది సీజ్ ఫైర్’కు సీక్వెల్గా రానున్న ఈ సినిమా నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. దర్శకుడు ప్రశాంత్నీల్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగాన్ని షూట్ చేశారని తెలుస్తున్నది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజాసాబ్’ చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో .. ప్రభాస్ ఇక ‘శౌర్యంగపర్వం’పైనే దృష్టిపెట్టబోతున్నారని అంటున్నారు. ఆగస్ట్ రెండోవారం నుంచి ఆయన షూట్లో జాయిన్ కాబోతున్నారని సమాచారం.