Pawan Kalyan | ఏపీ లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్ నుంచి టీడీపీ-జనసేన కూటమి మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. . రాష్ట్రవ్యాప్తంగా కూటమి 133 (టీడీపీ) స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నాయి.
కాగా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ 70,354 ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుంధుభి మోగించారు. ఉస్తాద్ భగత్సింగ్లో గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్దీ అనే డైలాగ్తో బాక్సాఫీస్ను షేక్ చేసినట్టుగానే.. ఎన్నికల ఫలితాల్లో రికార్డు మెజారిటీతో గెలుపొంది పవన్ కల్యాణ్ అభిమానులకు తన గెలుపును బహుమతిగా అందించారు . పవన్ కల్యాణ్ ఇక అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ఫాలోవర్లు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు