ఆర్య, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కమార్ నిర్మిస్తున్నారు. ఆదివారంతో చిత్రీకరణ పూర్తయింది.
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘యాక్షన్ ప్రధానంగా భారీ బడ్జెట్తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఉగాండా, అజర్బైజాన్, జార్జియా వంటి దేశాల్లో చిత్రీకరణ జరిపాం. పోరాట ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’ అన్నారు. శరత్కుమార్, మంజు వారియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తన్వీర్ దిబు, సంగీతం: దిబు నివాస్ థామస్.