రష్యా నటి లియుబా షామ్, కుష్బు జైన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నిన్ను వదలను’. హాలీవుడ్ స్టూడియోస్, శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై అశోక్ కుల్లర్ నిర్మిస్తున్నారు. షిరాజ్ మెహది దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.
దర్శకుడు మాట్లాడుతూ ‘హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశమిది. రష్యా సింగర్, ప్రొడ్యూసర్ అయిన లియుబా షామ్ ఈ సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేస్తున్నది. గోవా, హైదరాబాద్ నేపథ్యంలో కథ సాగుతుంది’ అన్నారు. గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కొమరి, దర్శకుడు: షిరాజ్ మెహది.