Ustaad Bhagat Singh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమాకు గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. 2022లోనే మొదలైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వలన వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై హరీశ్ శంకర్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
ఎక్స్లో ఒక నెటిజన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ఆగిపోనుందంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి హరీశ్ శంకర్ రిప్లయ్ ఇస్తూ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా స్టార్ట్ కానప్పుడే ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. అప్పుడే నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి వాటి గురించి చదివే సమయం కూడా లేదు. నా దృష్టి ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పైనే వుంది’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..