OMG | చారి 111 సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఓఎమ్జీ (OMG). ఓ మంచి గోస్ట్ ట్యాగ్ లైన్తో హారర్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నందితా శ్వేతా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..షకలక శంకర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన ఓఎమ్జీ మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది.
ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తుండటంతో ప్రమోషన్స్లో బిజీగా ఉంది వెన్నెల కిశోర్ టీం. ప్రమోషనల్ ఈవెంట్లో హీరోయిన్ నందితా శ్వేత (Nandita swetha) మాట్లాడుతూ.. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. శంకర్ నాకు కథ చెప్తూ ఉంటే నవ్వుతూనే ఉన్నానని అంది. హార్రర్ కామెడీ జోనర్లో రాబోతున్న ఈ మూవీని కుటుంబసమేతంగా చూడొచ్చు. మా సినిమా అందరినీ నవ్వించేలా ఉంటుంది. నాకు ఇలాంటి మంచి రోల్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. షూటింగ్ను మేమంతా సరదాగా చేశాం. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందని చెప్పింది.
కరోనా టైంలో శంకర్ తనకు ఈ కథ చెప్పారని.. అప్పుడు చిన్నగా అనుకున్నారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సినిమా అద్భుతంగా వచ్చిందని మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అన్నారు. వెన్నెల కిషోర్, నందిత, షకలక శంకర్ మధ్య సీన్లు బాగా వచ్చాయని చెప్పాడు అనూప్ రూబెన్స్. నిర్మాతగా ఇది తనకు తొలి సినిమా అని.. శంకర్ ఎంత బాగా కథ చెప్పారో.. అంతకు మించి సినిమా తెరకెక్కించారని నిర్మాత బినికా ఐనాబతుని అన్నారు. అందరూ చూడదగ్గ సినిమా ఇదని చెప్పారు.