న్యూఢిల్లీ: కొన్ని డ్రైవింగ్ లైసెన్స్లతోపాటు సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సేవలను పూర్తిగా ఆన్లైన్ చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో 18 రకాల సేవలను పూర్తిగా ఆన్లైన్ చేస్తున్నట్లు తెలిపింది. ఆధార్ ధృవీకరణతో ఈ సేవలను ఆన్లైన్లోనే పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ రెనివల్, వెహికిల్ రిజిస్ట్రేషన్, లెర్నింగ్ లైసెన్స్ లాంటి వాటి కోసం ఇక రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (ఆర్టీవో)లకు వెళ్లాల్సిన పనిలేదు. మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతాలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. పెద్దగా ఇబ్బంది లేకుండానే ప్రజలు ఈ సేవలు పొందడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
ఆ 18 సేవలు ఇవే..