Chalasani Aswini Dutt | ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు వైజయంతి మూవీస్ నిర్మాత చలసాని అశ్వనీదత్. ఆయన నిర్మాణంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాపై టికెట్ల రేట్ల విషయంలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు ఇవ్వడం మంచి నిర్ణయమని చెప్పిన అశ్వనీదత్.. ఈ పెంపు వల్ల బ్లాక్ టికెటింగ్ తగ్గుతుందని తద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు మంచే జరుగుతుంది అని చెప్పారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ప్రతి సినిమాకు ‘టికెట్ రేట్లు పెంచి నిర్మాతలు దండుకుంటున్నారు’ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ వివాదం ఇంకా ముదురుతుండడంతో తాజాగా దీనిపై అశ్వనీదత్ క్లారిటీ ఇచ్చాడు.
అశ్వనీదత్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్లో.. ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో టికెట్ రేట్ల పెంపుదల గురించి అనవసరపు అపోహలకు వస్తున్నాయి “సినిమా టికెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రతీసారి ప్రభుత్వం చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఓ శాశ్వతమైన ప్రతిపాదన చేయాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిలాష. నిర్మాతలంతా కూర్చుని, కూలంకుషంగా చర్చించుకొని, సినిమా బడ్జెట్ను బట్టి టికెట్ రేట్లు ఎంత వరకూ పెంచుకోవచ్చు, అది ఒక వారమా? 10 రోజులా ? అనే విషయంపై నిర్మాతలు ఒక నిర్ణయానికి వస్తే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తాను స్వయంగా చర్చిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అన్ని వర్గాల వారికి, ప్రేక్షకులకి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకొందామని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆయన నిర్మాతలందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారు అంటూ తెలిపాడు.
— Chalasani Aswini Dutt (@AshwiniDuttCh) July 5, 2024