Nindha | టాలీవుడ్ యాక్టర్ వరుణ్ సందేశ్ (Varun Sandesh) నటిస్తోన్న తాజా చిత్రం నింద (Nindha). థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రానికి రాజేశ్ జగన్నాథం దర్శకత్వం వహిస్తు్న్నాడు. కాండ్రకోట మిస్టరీ క్యాప్షన్తో వాస్తవ సంఘటనల ఆధారంగా ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుణ్ సందేశ్ టీం ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజేశ్ జగన్నాథం పలు విషయాలను షేర్ చేసుకున్నాడు.
తాను యూఎస్లో ఉద్యోగం చేస్తూ.. సినిమాల మీదున్న ఆసక్తితో ఫిల్మ్ మేకింగ్ కోర్సులు పూర్తి చేశానన్నాడు. వరుణ్తేజ్కు మంచి కమ్బ్యాక్లా ఉంటుందని ఆయనకు కథ చెప్పినట్టు వెల్లడించాడు. కాండ్రకోట మిస్టరీ అని నింద పోస్టర్ లాంఛ్ చేసినప్పుడు సినిమా ఘోస్ట్ మీద ఉండబోతుందని రాశారు. కానీ టీజర్ లాంఛ్ చేసిన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది. మొదట ఈ చిత్రానికి నిర్మాతల కోసం వెతికా. కథ మీద నమ్మకంతో వేరే నిర్మాతలెందుకని ఆలోచించి నేను నిర్మాతగా వ్యవహరించానని చెప్పాడు.
మలయాళ సినిమాలు చూసిన వాళ్లు ఇలాంటి సినిమాలు మన దగ్గర ఎందుకు రావనుకుంటారని.. నింద చూసిన తర్వాత మన దగ్గర కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు బాగా వస్తున్నాయని చెబుతారన్నాడు రాజేశ్. నిందలో కొత్త వరుణ్ సందేశ్ను చూస్తారన్నాడు.
ప్రమోషన్స్లో నిఖిల్ ఏమన్నాడంటే..?
I have watched the movie and I’m confident this will be a milestone film in #Varun‘s career.
– Hero #NikhilSiddhartha#Nindha #NindhaOnJune21st pic.twitter.com/lPea1ePktc— Sai Satish (@PROSaiSatish) June 17, 2024