అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప-2’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ప్రేక్షకులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ తుదిదశలో ఉంది. హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని కీలకఘట్టాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది.
ఇందులో హీరో అల్లు అర్జున్ కూడా పాల్గొంటున్నారని సమాచారం. ‘పుష్ప’ సాధించిన అఖండ విజయంతో సీక్వెల్పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది. ప్రచార చిత్రాలు, పాటలకు అద్భుతమైన స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది.