Chiranjeevi | క్రీడా అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) క్రీడలు ఆరంభమయ్యాయి. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సీన్ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది. ఈ ఆరంభ వేడుకల్లో పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం తన కుటుంబంతో కలిసి ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.
భార్య సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోని చిరు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పారిస్ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులందరికీ ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రస్తుతం చిరు ట్వీట్ వైరల్ అవుతోంది.
Absolutely thrilled to attend the inaugural of the #PARIS2024 #Olympics
A delightful moment holding the Olympic Torch replica along with Surekha !
Wishing each and every player of our proud Indian Contingent, All the Very Best and the Best Medal Tally ever!
Go India!!🇮🇳 Jai… pic.twitter.com/fjFWvf9csO— Chiranjeevi Konidela (@KChiruTweets) July 27, 2024
కాగా, చిరంజీవి ఫ్యామిలీతో కలిసి ఇటీవలే ఫారిన్ ట్రిప్కు వెళ్లిన విషయం తెలిసిందే. భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, ఉపాసన, క్లింకారతో కలిసి లండన్కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీతో తన విలువైన సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. ఈ ట్రిప్కు సంబంధించిన ఫొటోలను కూడా చిరంజీవి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక రామ్చరణ్ ప్రస్తుతం ‘గేమ్ఛేంజర్’లో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్రాజ్ నిర్మిస్తున్నారు. క్రిస్మస్కు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
అట్టహాసంగా ఒలింపిక్స్ ప్రారంభం
పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సీన్ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలైన ఆరంభ వేడుకలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం వేదికగా మొదలయ్యాయి. ఫుట్బాలర్ జిదానే ఒలింపిక్ టార్చ్ పట్టుకుని పరిగెత్తగా..అతన్ని అనుసరిస్తూ కొంత మంది చిన్నారులు పడవలో ప్రయాణించడంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెరతీసినట్లు అయ్యింది. ఫ్రాన్స్ ప్రధాని ఎమాన్యుయెల్ మక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అతిథులతో పాటు అభిమానులను చేతులు ఊపుతూ మార్చ్పాస్ట్కు స్వాగతం పలికారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
Also Read..
Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ ఆరంభ సంబరాల్లో.. ముఖేశ్ – నీతా అంబానీ దంపతులు
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు.. విధ్వంసానికి ఐఎస్ఐ కుట్ర
Paris Olympics: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో పొరపాటు.. దక్షిణ కొరియాను ఉత్తర కొరియాగా పరిచయం