గీసుగొండ, జూలై 1: వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్లో ఏర్పాటు చేసిన ప్లాంట్లో త్వరలో దుస్తుల తయారీని ప్రారంభించనున్నట్లు యంగ్వన్ కంపెనీ చైర్మన్ కిహాక్ సంగ్ తెలిపారు. ప్లాంట్ కోసం కేసీఆర్ ప్రభుత్వం 297 ఎకరాల భూమి కేటాయించినట్లు, పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు మంజూరు చేసిందన్నారు.
వెయ్యి కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, తద్వారా 11 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ఈ యూనిట్లో స్పో ర్ట్స్, డ్రెస్ మెటీరియల్స్, జర్కిన్స్, సూ ట్స్ తదితర దుస్తులు తయారుకానున్నాయి. అలాగే శిక్షణ కేంద్రంలో కుట్టుశిక్షణ తీసుకుంటున్న మహిళల వివరా లు అడిగి తెలుసుకున్నారు.