Volvo | న్యూఢిల్లీ, జూలై 3: స్వీడన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో.. దేశీయ మార్కెట్పై మరింత పట్టు సాధించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. దేశీయంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈవీలను మాత్రమే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇక నుంచి ప్రతీయేటా ఒక్కో ఈవీ మాడల్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ మార్టిన్ తెలిపారు. ఇక నుంచి పెట్రోల్, డీజిల్ వాహనాల విక్రయాలను నిలిపివేసే యోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్తున్నది.