న్యూఢిల్లీ, జూలై 2: దేశీయ మార్కెట్లోకి నయా వెస్పా అందుబాటులోకి వచ్చింది. లిమిటెడ్ ఎడిషన్గా విడుదలైన ఈ వెస్పా 946 డ్రాగన్ స్కూటర్ 155 సీసీ సామర్థ్యంతో తీర్చిదిద్దింది. కేవలం అంతర్జాతీయంగా 1,888 యూనిట్లు మాత్రమే విక్రయిస్తున్న ఈ మాడల్ ధర రూ.14,27,999(ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి)గా నిర్ణయించింది.
భారత్లో ఎన్ని యూనిట్లు విక్రయిస్తున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఈ స్కూటర్ కోసం ముందస్తు బుకింగ్లు ఆరంభించింది కూడా సంస్థ. డ్యూయల్ చానెల్ ఏబీఎస్, 200 ఎంఎం డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్స్తో రూపొందించిన ఈ స్కూటర్ యువతకు నచ్చుతుందని పేర్కొంది.