Tata Punch | దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ (Tata Punch) అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. 2024 జనవరి- జూలై మధ్య 1,26,000 కార్లు విక్రయించింది. గతేడాదితో పోలిస్తే మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ను దాటేసింది. ఈ సెగ్మెంట్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మారుతి సుజుకి ఆధిపత్యానికి టాటా పంచ్ చెక్ పెట్టింది. గత నెల విక్రయాల్లో మాత్రం టాప్-10 కార్లలో టాటా పంచ్ నాలుగో స్థానానికి పడిపోయింది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో హ్యుండాయ్ క్రెటా మొదటి స్థానంలో నిలిచింది.
కార్ల కొనుగోలుదారుల్లో మెజారిటీ ఆల్టర్నేటివ్ ఫ్యుయల్ ఆప్షన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి ఐదు కార్లలో సగం టాటా పంచ్ కొనుగోలు చేస్తున్నారు. మొత్తం టాటా పంచ్ సేల్స్లో ఎలక్ట్రిక్, సీఎన్జీ వేరియంట్లు 47 శాతం ఉంటాయి. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కార్లలో సీఎన్జీ వేరియంట్ 45 శాతం, మారుతి సుజుకి బ్రెజా 27 శాతం, మారుతి సుజుకి ఎర్టిగా 58 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ఎస్యూవీ తరహా ఫీచర్లతోపాటు తక్కువ ధరకే అందుబాటులో ఉండటం వల్ల మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా పంచ్ కు ఆదరణ పెరిగింది. 1.26 లక్షల టాటా పంచ్ కార్లలో 79 వేలకు పైగా ఎలక్ట్రిక్, సీఎన్జీ వేరియంట్ టాటా పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. మిగతా నాలుగు కార్లలో సీఎన్జీ లేదా డీజిల్ మాత్రమే పెట్రోల్ వేరియంట్లకు ఆల్టర్నేటివ్ గా నిలిచాయి. టాటా పంచ్ డ్యుయల్ ఫ్యుయల్ స్ట్రాటర్జీని ఇతర కార్ల తయారీ సంస్థలు పట్టించుకోలేదు. గతేడాది జూలైలో హ్యుండాయ్ ఆవిష్కరించిన ఎక్స్ టర్.. 2023లో 7,000 విక్రయిస్తే, ఈ ఏడాది 52,684 యూనిట్లకు పరిమితమైంది.