Stock markets : స్టాక్ మార్కెట్ (Stock markets) లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ (Sensex) ఇవాళ్టి ట్రేడింగ్లో చరిత్ర సృష్టించింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా సెన్సెక్స్ 80 వేల గరిష్ఠ మార్క్ను తాకింది.
అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సూచీ నిఫ్టీ (Nifty) సైతం లాభాల్లో దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో 24,200 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ 150కి పైగా లాభంతో దూసుకెళ్తున్నది. సెన్సెక్స్ 80,039 పాయింట్ల వద్ద తన జీవితకాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది.